- Advertisement -
కోలీవుడ్ నటి శృతి పెళ్లి పేరుతో అనేకమందిని మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ ఎన్నారై.శృతి అమాయకులను తన వలలో వేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడేదని తెలుస్తుంది.చాలా మంది తమ గుట్టు ఎక్కడ బయటపడతాయని చాలా మంది సైలెంట్ అయ్యారని సమాచారం.పెళ్లి పేరు చెప్పి తననుంచి 43 లక్షలు తీసుకుని కొన్నాళ్ళ తర్వాత పత్తా లేకుండా పోయిందని అన్నాడు ఎన్నారై.
ఆడిపోనాల్ అవని అనే తమిళ చిత్రంలో నటించి మంచి నటిగా పాపులర్ అయిన శృతి అసలు రంగు బయటపడేసరికే చాలామంది ఈమె చేతిలో మోసపోయారు. దాంతో ఈ నటిమీద కోయంబత్తూరులో పోలీసు కేసు నమోదైంది. దీంతో శృతిని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు.