ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ‘2.ఓ’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటీవ్ టాక్తో దూసుకుపోతోంది. ఈ సినిమాకు తమిళ రాకర్స్ బిగ్ షాక్ ఇచ్చారు. ముందు చెప్పినట్లుగానే తొలి రోజు తొలి ఆట ముగియక ముందే సినిమాను ఆన్లైన్లో లీక్ చేసింది. 2.ఓ మూవీని కచ్చితంగా లీక్ చేస్తామని గతంలోనే చెప్పిన తమిళ్ రాకర్స్.. మద్రాసు హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ, చెప్పినట్టే పైరసీ చేయడం సంచలనంగా మారింది. ఇది సినీ వర్గాలకు షాక్ తగిలింది.
శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రూ.600 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన 2.ఓ సినిమా భారీ అంచనాలతో గురువారం (నవంబర్ 29) ప్రేక్షకుల ముందుకొచ్చింది. అద్భుతమైన విజువల్స్, కళ్లు చెదరగొట్టే వీఎఫ్ఎక్స్, రెహమాన్ సంగీతంతో సినీప్రియులను కట్టిపడేస్తోంది.
2.ఓ సినిమా థియేటర్లలో రిలీజైన కొద్ది గంటల్లోనే తమిళ్ రాకర్స్ వెబ్సైట్లో పైరసీ ప్రింట్ దర్శనమిచ్చింది. అది కూడా హై క్వాలిటీ హెచ్డీ ప్రింట్ కావడం గమనార్హం. లైకా ప్రొడక్షన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. తమిళ్ రాకర్స్ ఎత్తుగడలను నిలువరించకపోయింది.
2.ఓ’ చిత్రం విడుదలై కొన్ని గంటలు కూడా గడవక ముందే పైరసీ లింకులు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తుండటంతో చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సినిమా ఓపెనింగ్స్ పరంగా అద్భుత వసూళ్లను సాధించినప్పటికీ పైరసీ ప్రభావాన్ని తట్టుకుని ఇకముందు నిలబడగలదా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.