Saturday, May 4, 2024
- Advertisement -

‘యాత్ర’ సినిమా చూసి థియోట‌ర్ల‌లోనే ఏడ్చేసిన‌ టీడీపీ లీడ‌ర్‌

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిని సినిమా యాత్ర. ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి పాద‌యాత్ర ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వ‌స్తోంది. ఈ సినిమాలో వైఎస్‌గా మళ‌యాళ మెగాస్టార్ మ‌మ్మూట్టి న‌టించిన సంగ‌తి తెలిసిందే. సినిమాలో వైఎస్‌గా మ‌మ్మూట్టి న‌టించారు అనే దాని క‌న్నా జీవించార‌ని సినిమా చూసిన వారు చెప్ప‌టం విశేషం. తాజాగా యాత్ర‌ సినిమాను ప్ర‌త్య‌ర్థి పార్టీ వాళ్ల సైతం చూస్తున్నారు. క‌డ‌ప జిల్లాకు చెందిన టీడీపీ నేత అత్తోటి చంటి గారు క‌డ‌ప‌లోని ఓ థియోట‌ర్‌లో యాత్ర సినిమాను చూశార‌ట‌. సినిమా చూస్తున్న స‌మ‌యంలో వైఎస్‌ను గుర్తుకు తెచ్చుకుని కంట క‌న్నీరు పెట్టుకున్నార‌ట ఈ టీడీపీ నాయ‌కుడు.

వైఎస్‌తో అత్తోటి చంటికు మంచి సానిహిత్యం ఉంది. పార్టీలు వేరు అయిన‌ప్ప‌టికి వైఎస్‌తో క‌లివిడిగా ఉండేవార‌ట వీరిద్ద‌రు. దీంతోనే యాత్ర సినిమాను థియోట‌ర్లో చూడ‌టానికి వ‌చ్చాడు ఈ టీడీపీ నేత. ఆయ‌న కంట క‌న్నీరు కారుస్తున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెర వైర‌ల్ చేస్తున్నారు వైసీపీ అభిమానులు. మ‌రి దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇప్ప‌టికి అయితే యాత్ర సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ సినిమా రాయ‌ల‌సీమ‌లోని అన్ని థియోట‌ర్ల‌లో హౌస్‌ఫుల్‌తో ర‌న్ అవుతుంది.

https://twitter.com/2019YSRCP/status/1093868942227984384

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -