టాలీవుడ్లో ప్రస్తుతం బయోపిక్ల హడవిడి నడుస్తుంది. మహనటి సినిమా సక్సెస్ తరువాత మరిన్ని బయోపిక్లు రెడీ అవుతున్నాయి.వాటిలో హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్ ఒకటి.ఉదయ్ కిరణ్ బయోపిక్కు రంగం సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు తేజ.అసలు ఉదయ్ కిరణ్ని ఇండస్ట్రీకి పరిచియం చేసిందే తేజ.చిత్రం సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ని ఇండస్ట్రీకి పరిచియం అయ్యాడు.ఈ సినిమా తరువాత ఉదయ్ కిరణ్కు నువ్వు నేను సినిమాతో మరో సినిమా హిట్ ఇచ్చాడు దర్శకుడు తేజ.
ఉదయ్కిరణ్ను చాలా దగ్గర ఉండి గమనించిన వారిలో తేజ ఒకరు.అందుకే ఉదయ్ కిరణ్ బయోపిక్కు రంగం సిద్ధం చేస్తున్నాడు.ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగిన ఉదయ్ కిరణ్ …చివరికి సరైన అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.దీనికి కారణం చాలామంది మెగా ఫ్యామిలీ అని అంటారు.దీనికి గల కారణాలు కూడా ఉన్నయి.వరుస హిట్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఉదయ్కిరణ్ని అల్లుడు చేసుకొవలని చూశాడు మెగాస్టార్ చిరంజీవి.
ఒకే కులం కావడం, తనలాగే ఎటువంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో పైకి రావడంతో తన కుతురుని ఇచ్చి పెళ్లి ఉదయ్ కిరణ్ని అల్లుడుగా చేసుకోవలని భావించాడు చిరంజీవి.దీనికి ఉదయ్ కిరణ్ కూడా అంగీకారం తెలిపాడు.నిశ్చితార్థం కూడ జరిగింది.కాని కారణాలు ఏవో తెలియవు కాని సడన్గా ఉదయ్ కిరణ్ చిరంజీవి కుతురుని పెళ్లి చేసుకొవడం లేదని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు.అప్పటి నుండి ఉదయ్ కిరణ్కు బ్యాడ్టైం స్టార్ట్ అయిందనే చెప్పాలి.దర్శకులు ఎవరు ఉదయ్ కిరణ్ దగ్గరకు రావడం లేదు.
హీరోగా బుక్ చేసిన సినిమాలు కూడా క్యాన్సిల్ చేశారు.వీటంతటికి మెగా ఫ్యామిలీయే కారణం అని కామెంట్స్ వినిపించాయి.తరువాత కాలంలో ఉదయ్ కిరణ్ క్రేజ్ తగ్గిపోవడం ఆయనకు సినిమాలలో అవకాశాలు రాకపోవడం జరిగింది. ఈ డిప్రెషన్లో ఉదయ్ కిరణ్ ఓ రోజు తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.ఇప్పుడు దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటలన ఆధారంగా బయోపిక్గా తీయడానికి రెడీ అవుతున్నాడు. మరి ఉదయ్ కిరణ్ బయోపిక్ అంటే చిరంజీవి ఫ్యామిలీ గురించి తప్పకుండ చూపించాలి.
మరి తేజ మెగా ఫ్యామిలీని టచ్ చేస్తాడా అనే అనుమానం కలుగుతుంది.ఎందుకంటే ఇండస్ట్రీలో చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉంది.మరి ఇటువంటి మనిషిని చెడుగా చూపిస్తే ఆయన అభిమానులు ఊరుకుంటారా! మెగా ఫ్యామిలీ ఎపిసోడ్ లేకుండా సినిమా తీసిన ఆ సినిమా సంపూర్ణంగా తీసినట్టు ఉండదు. మరి ఎన్టీఆర్ బయోపిక్ నుండి బయటికి వచ్చిన తేజ మరో బయోపిక్తో రెడీ అవుతున్నాడు. ఈ సినిమా అయిన పట్టాలు ఎక్కుతుందో లేదో చూడాలి.