తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో గొడవలు బయటికి రావడంతో మరోసారి తెలుగు ఇండస్ట్రీ పరువు రోడ్డున పడింది. ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా నిధులను దుర్వినియోగం చేశారని ‘మా’ కార్యదర్శి నరేష్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.దీంతో తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రెండు వర్గాలుగా విడిపోయి,విమర్శలు చేసుకుంటున్నారు.ఈ వ్యవహారంలోకి చిరంజీవి పేరును కూడా లాగడంలో గొడవ మరింత పెద్దగా మారింది.దీంతో ఇండస్ట్రీ పెద్దలు ఈ గొడవను సర్ధుమణిగేలా రాజీ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు.
దీనిలో భాగంగానే మా అధ్యక్షుడుగా శివాజీ రాజాను తప్పించి ‘మా’ ప్రెసిడెంట్ గా జయసుధని తీసుకోవాలనే ప్రతిపాదనలు మొదలయ్యాయి. ‘మా’తో కలిసి కొన్నేళ్ల పాటు సేవలు చేసిన జయసుధ అయితే ఆ పదవికి న్యాయం చేయగలదని ఆమె పేరుని సూచిస్తున్నారు. గతంలో కూడా జయసుధ ‘మా’ ప్రెసిడెంట్ గా చేయాలని ఎలెక్షన్స్ లో పార్టిసిపేట్ చేశారు. కానీ ఆ సమయంలో జయసుధ ఓడిపోవడం జరిగింది. ఆ ఎన్నికలలో రాజేంద్రప్రసాద్ విజయం సాధించి ప్రెసిడెంట్ అయ్యారు.మరి జయసుధని మా అసోసియేషన్ అధ్యక్షురాలిగా అందరు ఒప్పుకుంటారో లేదో చూడాలి.