Thursday, May 2, 2024
- Advertisement -

లస్ట్ స్టోరీస్ ని రీమేక్ చేయబోతున్న తెలుగు దర్శకులు

- Advertisement -

బాలీవుడ్ లో వెబ్ సిరీస్ రూపంలో నెట్ఫ్లిక్ లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్’ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. మనీషా కొయిరాలా, కియారా అద్వానీ, నేహా దుపియా, భూమి పెడ్నేకర్, విక్కీ కౌశల్, రాధిక ఆప్టే తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో విడుదలై సందడి చేసింది. తాజాగా ఇప్పుడు తెలుగులో ఈ సిరీస్ ని రీమేక్ చేయాలని ప్రయత్నిస్తున్నారట. నెట్ఫ్లిక్ స్వయంగా తెలుగు లో ‘లస్ట్ స్టోరీస్’ ని నిర్మించనున్నారట. నిజానికి హిందీ వెబ్ సిరీస్ కి నలుగురు దర్శకులు దర్శకత్వం వహించారు.

తాజాగా తెలుగులో ఈ వెబ్ సిరీస్ కోసం కూడా నలుగురు దర్శకులను ఎంపిక చేశారట. వారు సందీప్ రెడ్డి వంగ, నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్ మరియు సంకల్ప్ రెడ్డి. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. హిందీలో ఒక్కో కథకు జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్, దిబాకర్ బెనర్జీ మరియు కరణ్ జోహార్ లు దర్శకత్వం వహించారు. నలుగురు ఆడవాళ్ల మోడర్న్ రిలేషన్ షిప్స్ గురించి ఈ వెబ్ సిరీస్ కథ నడుస్తుంది. ఇంతకీ తెలుగు వర్షన్ లో ఎవరు నటించబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు ‘లస్ట్ స్టోరీస్’ రీమేక్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో విడుదల కాబోతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -