Sunday, April 28, 2024
- Advertisement -

టైగర్ నాగేశ్వరరావు..మేకర్స్‌ని అభినందించాల్సిందే

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. రవితేజ సరసన నుపుర్ సనన్ హీరోయిన్‌గా పాన్ ఇండియా చిత్రంగా అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక రవితేజ కెరీర్‌లో ఇది తొలి పాన్‌ ఇండియా చిత్రం. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌తో మెప్పించాడు రవితేజ.

ఇక తాజాగా సినిమా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్ సైన్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. కేవలం సైగలతో మాత్రమే కమ్యూనికేట్ చేయడానికి వాడే బాష ఇది.కొందరు దివ్యాంగులు కమ్యూనికేట్ చేసే భాష ఇది. ఈ నేపథ్యంలో వారికి కూడా అర్ధం అయ్యే తరహాలో టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో చిత్ర బృందాన్ని అంతా అభినందిస్తున్నారు.

ఇక ట్రైలర్‌తో షేక్ చేసేశాడు రవితేజ. స్టువర్టుపురం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి లూటీ చేయాలన్న ముందుగానే ఆ ఏరియాలను వేలంపాటలో దక్కించుకోవాల్సి ఉంటుందని ట్రైలర్ లో చూపించారు. దొంగలలో అతి భయంకరమైన దొంగగా రవితేజను ప్రజెంట్ చేశారు. ఒకవైపు డబ్బు బంగారం పై మొహం పెంచుకున్న టైగర్ మరోవైపు అమ్మాయిలకు ఎలా అట్రాక్ట్ అయ్యాడనేది అద్భుతంగా చూపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -