Monday, April 29, 2024
- Advertisement -

టాలీవుడ్లో కొత్త సరుకు… పాతమేళంను ఏం చేద్దాం

- Advertisement -

టాలీవుడ్లో రాను రాను కొత్త సరుకు పెరిగిపోతుంది. నిన్నటివరకు ఓ ఊపు ఊపిన అనుష్క, తమన్నా, కాజల్ ,నయనతారలు ఆల్మోస్ట్ పక్కకు వెళ్లిపోయారు. వీరిని గత ఏడు ఏనిమిది ఏళ్ల నుంచి తనివి తీరా చూసిన సినీ జనాలు ఇక చాలనుకున్నారనుకుంట. అయితే అటు అరవ బ్యాచ్ మాత్రం వీరిలో ఇంకా రసం ఏదో ఉందనుకునే ఏదో…. ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. అనుష్క,కాజల్ ,నయనతారలు ఆ విధంగానే బండి లాగిస్తున్నరక్కడ. కాని గత రెండేళ్లనుంచి సౌత్ కు వస్తోన్న కొత్త తారలు తమ హాట్ యాంగిల్ ను చూపిస్తూ… జనాలను తమ వైపుకు తిపుకుంటున్నారు.దీంతో సీనియర్ భామలు ..తాజా బేబీల ముందునిలబడలేకపోతున్నారు.

ఇపుడొస్తున్న తారలు ఏమైనా తోపులా అంటే అదీ కాదాయే.మహా అయితే ఇంకో రెండు మూడేళ్లు మాత్రమే నిలబడే సరుకున్నవాళ్లు.కాని జనాలకు కొత్తొక వింతకదా. అందుకే అస్సలు వదిలిపెట్టడం లేదు.మాకు ఈ పోరీలే కావాలంటున్నారు.వీరు ఉంటే నేల టికెట్ భాగా తెగుతుందనే అభిప్రాయానికి వచ్చేశారు. రకుల్ ప్రీత్ ,రెజీనా,మెహ్రీన్ ,కీర్తిసురేష్ ,అను ఇమాన్యుయల్ నివేదా థామస్ లనే తీసుకుందాం. అనుష్క,తమన్నా,నయనతార తరహా పర్ ఫార్మెన్స్ ను వీరు ఇచ్చే ఛాన్స్ ఉందా అంటే…లేదనే చెబుతాం.కాని ఏం చేస్తాం.పాత భామలను చూసి చూసి బోర్ కొట్టింది కాబట్టి వీరిని ఇంటికి పంపేసి..ఈ తాజా పోరీలకు పట్టం కడదామని చూస్తున్నారు.రకుల్ మాత్రం ఇపుడు టాప్ పొజిషన్ లో ఉంది గాని…ఈఏడాది ఎండింగ్ లో నోటెడైనా అను,కీర్తి సురేష్ లు వచ్చే ఏడాది మెరుపులు మెరిపించాలని ఆశపడుతున్నారు.

రకుల్ ,రెజీనాలు ఫిగర్ పరంగా మాంచి మెజర్ మెంట్స్ తో ఉన్నారు కాబట్టి నడిపించేస్తున్నారు. మరి తాజాగా వచ్చిన వారిలో ఆ మెజర్ మెంట్స్ అంతగా ఎవ్వరిలోను కనిపించడం లేదు. మహా అయితే అను ఇమాన్యుయల్ లో ఏదో కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ టైమ్లో అను ఏకంగా ట్రాన్స్ పరెంట్ శారీ వేసి తన నాభి అందాలను చూపించి..చూస్కోండి బాబు అంటూ పవన్ ఫ్యాన్స్ ను పండగ చేసుకోమంది.మరి వచ్చే ఏడాది ఇంకా ఎందరు భామలు అను మాదిరిగా అభిమానులతో అల్లుకుపోయి తెరపై తెగ వయ్యారాలు పోతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -