మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కమెడియన్ సునీల్ మంచి స్నేహితులని చాలామందికి తెలుసు.కెరీర్ తొలినాళ్లలో వీరిద్దరు పంజాగుట్ట దగ్గర ఒకే గదిలో అద్దెకు ఉండేవారు.తరువాత ఎవరికి వారు బిజీ అయ్యారు.సునీల్ కమెడియన్గా కాకుండా హీరోగా సినిమాలు చేయడం మొదలు పెట్టాడు.రెండు హిట్లు వచ్చిన తరువాత వరుస ఫెయిలుర్స్ సునీల్ను వెక్కిరించాయి.దీంతో సునీల్ను హీరోగా పెట్టి సినిమాలు తీయడానికి నిర్మాతలు ఎవరు ముందుకు రాకపోవడంతో మళ్లీ కమెడియన్గా చెద్దామని డిసైడ్ అయ్యాడు.తన స్నేహితుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సమేత సినిమాతో కమెడియన్గా రీ ఎంట్రీ ఇచ్చాడు సునీల్.ఆయన పాత్రకి రావలసినంత గుర్తింపు రాలేదు.
ఇక ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలో సునీల్ మంచి రోల్ చేసినా, ఆ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడంతో సునీల్ పాత్రను గుర్తుపెట్టుకున్నవారు లేరు. కమెడియన్ గా తన రీ ఎంట్రీ పట్ల సునీల్ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో, తన తదుపరి సినిమాలో మంచి రోల్ క్రియేట్ చేస్తానని త్రివిక్రమ్ మాట ఇచ్చాడట. త్రివిక్రమ్ తదుపరి సినిమా అల్లు అర్జున్ తో వుండనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ సినిమాలో కామెడీకి ప్రాధాన్యత ఉంటుంది కనుక, సునీల్ కి మంచి పాత్ర పడుతుందనే భావించవచ్చు.