Wednesday, May 8, 2024
- Advertisement -

అది పోవడంతో త్రివిక్రమ్ ను హీరోలంతా పక్కనపెట్టేశారా?!

- Advertisement -

మొన్నటి వరకూ త్రివిక్రమ్ తో సినిమాలు చేయడానికి మెగాస్టార్ దగ్గర నుంచి  అనేక మంది హీరోలు ఉత్సాహంతో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. 150 వ సినిమా చేయడం పట్ల ఆసక్తి చూపుతున్నచిరంజీవి అనుకొంటున్న దర్శకుల జాబితాలో త్రివిక్రమ్ ఉన్నాడని వార్తలు వచ్చాయి.

ఇక జూనియర్ ఎన్టీఆర్ , మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ , రామ్ చరణ్ లు ఈ దర్శకుడి డైరెక్షన్లో నటించడానికి ఎవిరెడీ గా ఉన్నారని వార్తలు వినిపించాయి.

ఒకవైపు ఈ హీరోలు అంతా తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నా.. అల్లు అర్జున్ సినిమాతో త్రివిక్రమ్ బిజీగా ఉండటంతో వీళ్లతో సినిమాలు ఆలస్యం అవుతున్నాయని.. ఒక్కసారి ఆ సినిమా పూర్తి అయ్యి.. విడుదల కాగానే.. ఈ హీరోలంతా త్రివిక్రమ్ ను లాగేసుకోవడానికి రెడీ ఉన్నారనిటాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జరిగింది.

మరి తీరా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ రానే వచ్చింది. అయితే ఇది అనుకొన్నంత హిట్ కాలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను పెట్టుకొన్నవారిని నిరాశపరిచింది. భారీ బడ్జెట్ తో రూపొంది జస్ట్ యావరేజ్ అనిపించుకొంది. చాలా ఆశలతో ఈ సినిమాను కొన్న బయ్యర్లు నిరాశపడ్డారు.

ఇంకేముంది.. ఏ హీరో కూడా ఈ దర్శకుడిని పట్టించుకోవడం లేదట ఇప్పుడు. ఎవరికి వారు బిజీ అయిపోయారు. మహేశ్ బాబు అనుకొంటే.. ఆయన ఉన్నట్టుండి పూరి సినిమాతో బిజీ అయ్యాడు. ఇక చరణ్ ప్రాజెక్టులు అతడికున్నాయి. పవన్ కల్యాన్ గబ్బర్ సింగ్ 2 పనిలో ఉన్నాడు. ప్రభాస్ తనపనిలో తానున్నాడు. చిరంజీవి సినిమాను కూడా పూరినే తన్నుకుపోయేలా ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో త్రివిక్రమ్ ను కరుణించే హీరోనే లేకుండాపోయాడని తెలుస్తోంది. కొన్ని నెలల వరకూ త్రివిక్రమ్ పని ఇంతేనని.. వీరిలో ఎవరో ఒకరు అవకాశం ఇస్తే తప్ప త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పెద్ద సినిమా ఏదీ ప్రారంభం అయ్యే అవకాశాలు లేవని టాక్. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -