ఒక్క అజ్ఞాతవాసి సినిమాతో త్రివిక్రమ్ డైరక్షన్పై అనుమానాలు ఏర్పడ్డాయి.అంతకముందు ఆయన ఇచ్చిన హిట్ల సంగతి మరిచిపోయి ఒక్క అజ్ఞాతవాసి ఫ్లాప్నే లెక్క వేసుకుంటున్నారు.పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మూడో మూవీ అజ్ఞాతవాసి.ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.కాని సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయింది.పవన్ నటనపై కూడా విమర్శలు వచ్చాయంటే సినిమా ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకొవాలి.అయితే తాజాగా అజ్ఞాతవాసి ఫ్లాప్పై స్పందించాడు త్రివిక్రమ్.
సినిమా స్టోరి సెలెక్ట్ చేసుకోవడంలోనే మేము తప్పు చేశామని అంగీకరించాడు. అయిన ఫ్లాప్లు వస్తే కుంగిపోయే వ్యక్తిని కాదని,తన తరువాత సినిమాతో తను మళ్లీ ఫామ్లోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు.త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ‘అరవింద సమేతస సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతుంది.సినిమాలో పూజ హెగ్డె హీరోయిన్గా నటిస్తుంది.ఈ సినిమాను దసరాకు విడుదల చేయలని చిత్ర యూనిట్ భావిస్తుంది.