- Advertisement -
టీవీ నటి సూర్య శశికుమార్, ఆమె సోదరి శ్రుతి, తల్లి రీమాదేవీ దొంగనోట్లు ముద్రిస్తు అడ్డంగా దొరికిపోయారు.కొల్లంలోని తమ ఇంట్లో ఈ ముగ్గురు దొంగ నోట్లు ముద్రిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడే వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
రెండు లక్షల పాతిక వేల నకిలీ నోట్లను తరలిస్తోన్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ మేరకు వారి ఇంటిపై సోదాలు నిర్వహించిన పోలీసులకు రూ.57 లక్షల విలువైన దొంగనోట్లు దొరికాయి. వాటిని సీజ్ చేసి నటి కుటుంబాన్ని అరెస్ట్ చేశారు.దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.