సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత, ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ తనకు హిట్లు వచ్చినా.. అపజయాలు వచ్చినా సినిమాలు తీయడం మానడం లేదు. ఇటీవల ఆయనకు రెండు భారీ సినిమాలు ఫ్లాపయ్యాయి. ఒకటి బాలకృష్ణ నటించిన జైసింహా, రెండోది సాయిధరమ్ తేజ్తో తీసిన ‘ఇంటిలిజెంట్’ సినిమా. ఈ రెండు సినిమాలు ఫ్లాపయినా కూడా తాను సినిమాలు చేస్తానని చెబుతున్నాడు.
ఇప్పుడు రెండు సినిమాలకు త్వరలో రెండు భారీ ప్రాజెక్ట్స్ చేయడానికి సిద్ధమవుతున్నారట. ఇప్పుడు వీవీ వినాయక్ దర్వకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఒక సినిమాను సి.కల్యాణ్ ప్రకటించాడు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అల్లు అర్జున్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటుందని తెలుస్తోంది.
అన్నీ కుదిరితే అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తరువాత సంపత్ నందితో బన్నీ చేసే అవకాశం ఉంది. సినిమా తరువాత సి. కల్యాణ్ నిర్మించే రెండు భారీ సినిమాలు ఇవి. త్వరలో ఈ విషయాలపై కల్యాణ్ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.