- Advertisement -
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు రెండు సర్జరీలు చేశారు. ఐసీయూ నుంచి ఇవాళ ఆమెను వార్డుకు తరలించారు డాక్టర్లు. అయితే.. ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం కోలుకుంటున్నారని రెండు వారాల పాటు విశ్రాంతిలో ఉండనున్నారని ఆమె భర్త సెల్వమణి తెలిపారు.
ఫ్యాన్స్ ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని.. అలాగే ఆస్పత్రి వచ్చేందుకు ప్రయత్నాలు చేయవద్దని ఆయన పేర్కొన్నారు. నటిగానే కాకుండా బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ ఇతర కార్యక్రమాల్లో ఆమె జడ్జీగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రోజా చేయించుకున్న శస్త్రచికిత్స కారణంగా జబర్దస్త్, ప్రజా కార్యక్రమాలకు కొన్ని రోజులు దూరంగా ఉండే అవకాశం ఉంది.
అలాంటి వారిని దూరం పెట్టండి.. సురేఖ వాణి షాకింగ్ పోస్ట్