ముంబై ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం మేజర్. జి.ఎమ్.బి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇందులో మేజర్ ఉన్ని కృష్ణన్ గా హీరో అడవి శేష్ కనిపించబోతున్నాడు.
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ, బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ ‘మేజర్’ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడుప్పుడు కరోనా తగ్గుతుండటం.. అన్ని రాష్ట్రాల్లోనూ ఆంక్షలు సడలిస్తుండటంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో హీరో అడవి శేష్ సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ న్యూస్ వెల్లడించాడు. త్వరలోనే ‘మేజర్’ రిలీజ్ డేట్పై అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలిపాడు. సరైన సమయంలో, సరైన తేదీకి “మేజర్” రిలీజ్ కానుంది అని పోస్ట్లో పేర్కొన్నాడు.
రాజశేఖర్ ను సినిమా నుంచి ఎందుకు తప్పించారు ?