Saturday, April 20, 2024
- Advertisement -

వరుణ్​తేజ్​ ఔదార్యానికి నెటిజన్లు ఫిదా..!

- Advertisement -

ముకుంద తో సినీ అరంగేట్రం చేసిన వరుణ్​ తేజ్​.. ఆరంభంలో కాస్త తడబడ్డ వరుణ్​ తేజ్​ ప్రస్తుతం నిలదొక్కుకుంటున్నాడు. ఫిదా, ఎఫ్​ 2, గద్దలకొండ గణేశ్​ సినిమాలు హిట్​ కావడంతో వరుణ్​ కూడా టాలీవుడ్​లో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇక తొలిప్రేమ, కంచె వంటి సినిమాలు వరుణ్​తేజ్ కు మంచి పేరే తీసుకొచ్చాయి. వరుణ్​ తేజ్​ వివాదరహితంగా ముందుకు సాగుతుంటాడు. ఇండస్ట్రీలో అందరినీ అప్యాయంగా పలకరిస్తుంటాడు. అంతేకాక వరుణ్​లో గొప్ప సేవా భావం కూడా ఉంది.

ఇటీవల కరీంనగర్​ కు చెందిన వరుణ్​ అభిమాని శేఖర్​ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో శేఖర్​ కుటుంబం రోడ్డున పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వరుణ్​ తెలుసుకున్నాడు. శేఖర్​ కుటుంబానికి తన వంతుగా రూ. 2 లక్షలు సాయం చేశాడు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని భరోసా ఇచ్చాడు. మొత్తానికి వరుణ్​ ఔదార్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Also Read: ఈ భామ జోరు చూస్తే ..పూజా హెగ్డే, రష్మికకు ఎసరు పెట్టేలా ఉందే..!

ప్రస్తుతం వరుణ్​ తేజ్​ అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్​-3 చిత్రంలో నటిస్తున్నాడు. ఎఫ్​ 2 హిట్​ కావడంతో.. ప్రస్తుతం దీనికి సీక్వెల్​ తీస్తున్నారు. ఇందులో మరో హీరోగా సీనియర్ హీరో వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు వరుణ్ కొత్త డైరెక్టర్ కిరణ్ దర్శకత్వంలో గని అనే సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Also Read: సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీకి ప్లస్సా.. మైనస్సా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -