ముకుంద తో సినీ అరంగేట్రం చేసిన వరుణ్ తేజ్.. ఆరంభంలో కాస్త తడబడ్డ వరుణ్ తేజ్ ప్రస్తుతం నిలదొక్కుకుంటున్నాడు. ఫిదా, ఎఫ్ 2, గద్దలకొండ గణేశ్ సినిమాలు హిట్ కావడంతో వరుణ్ కూడా టాలీవుడ్లో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇక తొలిప్రేమ, కంచె వంటి సినిమాలు వరుణ్తేజ్ కు మంచి పేరే తీసుకొచ్చాయి. వరుణ్ తేజ్ వివాదరహితంగా ముందుకు సాగుతుంటాడు. ఇండస్ట్రీలో అందరినీ అప్యాయంగా పలకరిస్తుంటాడు. అంతేకాక వరుణ్లో గొప్ప సేవా భావం కూడా ఉంది.
ఇటీవల కరీంనగర్ కు చెందిన వరుణ్ అభిమాని శేఖర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో శేఖర్ కుటుంబం రోడ్డున పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వరుణ్ తెలుసుకున్నాడు. శేఖర్ కుటుంబానికి తన వంతుగా రూ. 2 లక్షలు సాయం చేశాడు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని భరోసా ఇచ్చాడు. మొత్తానికి వరుణ్ ఔదార్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Also Read: ఈ భామ జోరు చూస్తే ..పూజా హెగ్డే, రష్మికకు ఎసరు పెట్టేలా ఉందే..!
ప్రస్తుతం వరుణ్ తేజ్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్-3 చిత్రంలో నటిస్తున్నాడు. ఎఫ్ 2 హిట్ కావడంతో.. ప్రస్తుతం దీనికి సీక్వెల్ తీస్తున్నారు. ఇందులో మరో హీరోగా సీనియర్ హీరో వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు వరుణ్ కొత్త డైరెక్టర్ కిరణ్ దర్శకత్వంలో గని అనే సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Also Read: సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీకి ప్లస్సా.. మైనస్సా..!