వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు వరుస ఫ్లాప్ల తరువాత రెండు వరుస హిట్లతో ఫాంలోకి వచ్చాడు.ఫిదా సినిమాతో 50 కోట్ల షేర్ కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.తరువాత వచ్చిన తొలిప్రేమ సినిమాలో సెటిల్డ్ నటనతో మంచి పేరుతో పాటు హిట్ కూడా కొట్టాడు.ఇంకా చెప్పాలంటే కష్టలలో ఉన్న మెగా ఫ్యామీలికి హిట్లు ఇచ్చాడు. కంచె సినిమాతో ప్రయోగాత్మక చిత్రం తీసిన వరుణ్ ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రనికి రెడీ అవుతున్నాడు.
ఆయనకి సంకల్ప్ రెడ్డి ఒక కథను వినిపించడం ,ఆ కథకి వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఆ సినిమా రెగ్యులర్ షూటింగును ఈ రోజున మొదలెట్టారు. వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి ,అదితీ రావు కథానాయికలుగా కనిపించనున్నారు.ఈ సినిమాలో, వ్యోమగామి పాత్రలో వరుణ్ కనిపించనున్నాడు. సంకల్ప్ రెడ్డి ఇంతకుముందు ‘ఘాజీ’ సినిమా విజయాన్ని అందించాడు.