టాలీవుడ్ ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణానికి సంబందించిన ఆసక్తికర విషయాన్ని డాక్టర్లు వెల్లడించారు.
కొందరు మరణాన్ని ముందే కనిపెట్టేస్తారని అంటారు. ఫైనల్ డెస్టినేషన్థీమ్ కాదు కానీ.. తన మరణం
గురువారం` అని లెజెండరీ దర్శకనిర్మాత విజయనిర్మల ముందే కనిపెట్టారని కాంటినెంటల్ ఆస్పత్రి డాక్టర్లు అనడం చర్చనీయాంశమైంది. అనారోగ్యం నుంచి కోలుకుంటారు.. తొందర్లోనే నయం అయిపోతుందని వారించబోయిన డాక్టర్లతో విజయనిర్మల సర్ ప్రైజ్ నిచ్చే ఓ మాటన్నారు.
‘పోవడం, పోవకపోవడం అలా ఉంచండి.. కానీ ఎప్పుడు పోయినా గురువారం నాడే జరుగుతుంది.. నేను గురువారమే మరణిస్తా’ అని చెప్పేవారట. అంటే గురువారం సామి వారు సాయిబాబాపై ఉన్న ప్రేమ- భక్తి భావంతో అమ్మ విజయనిర్మల అలా అన్నారని భావించాలి. మొత్తానికి బాబా భక్తురాలిగా ఆయన ఆశీస్సులు అందుకునే గురువారం వేకువ ఝామున స్వర్గస్తులయ్యారు.ఇలా ఇచ్చామరణం ఎవరికో కానీ రాదు.. విజయనిర్మల మాత్రం తను కోరుకున్నట్లుగా గురువారం నాడే తుదిశ్వాస విడిచింది.