అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీని ఆలోచనలో పడేశాడు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు విజయ్.అతను తాజాగా నటించిన గీతా గోవిందం సినిమా ఆగస్టు 15న విడుదల అయ్యి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించి తన సత్తా చాటింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఊహించని విధంగా ఘన విజయం అందుకున్న ఈ సినిమా సక్సెస్ ని చిత్రబృందం ఎంజాయ్ చేస్తోంది.
బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోన్న ఈ సినిమా తాజాగా మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది. నాన్ బాహుబలి రికార్డును తమిళనాడులో బద్దలు కొట్టింది. అక్కడ రూ.5 కోట్ల గ్రాస్ తో దూసుకుపోతుంది.విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ రష్మిక నటన కూడా సినిమా ఇంతటి హిట్ అవ్వడానికి కారణం అయిందని చిత్ర యూనిట్ భావిస్తుంది.పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బన్నీ వాసు-అల్లు అరవింద్ నిర్మాతలుగా వ్యవహరించారు.