విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం గీతా గోవిందం.ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది.అర్జున్ రెడ్డి సినిమా తరువాత విజయ్ నటించిన సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అంచనాలను నిజం చేస్తు సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తుంది.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా దుమ్ము దులుపుతోంది. తాజాగా ఈ సినిమా ఆస్ట్రేలియాలో టాప్ బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి కలెక్షన్లలో అగ్రస్థానం దక్కించుకుంది.గీత గోవిందం అమెరికాలో ఇప్పటిదాకా 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేసిన సంగతి తెలిసిందే.
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘గోల్డ్’, జాన్ అబ్రహాం నటించిన ‘సత్యమేవ జయతే’ సినిమాలను తాజాగా ఆస్ట్రేలియాలో గీత గోవిందం వెనక్కి నెట్టింది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో తెలిపారు.ఆస్ట్రేలియాలో గోల్డ్, సత్యమేవ జయతే సినిమాలు ఈ వారాంతానికి 1,92,306 డాలర్లు వసూలు చేయగా, ఒక్క గీత గోవిందం సినిమాకే 2,02,266 డాలర్లు వచ్చాయని వెల్లడించారు. విజయ్ దేవరకొండ ముందు అక్షయ్ కుమార్,జాన్ అబ్రహాం లాంటి స్టార్ హీరోస్ సైతం నిలబడలేకపోయారు.రాబోవు రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.