ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి భారత్ లో గత రెండు నెలలో బీభత్సం సృష్టించింది. దాంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమల్లోకి తీసుకు వచ్చారు. దాంతో ఎంతో మంది రోడ్డున పడ్డారు.. దినసరి కూలీల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరైన పనులు లేక ఆహారం అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటునానరు. ఇలాంటి సమయంలో ఆపన్నహస్తం అందించే వ్యక్తుల కోసం ఎదరుచూస్తున్నారు ప్రజలు.. ప్రభుత్వాలు. దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా ఉండగా.. రోజువారీ కరోనా కేసులు ప్రస్తుతం 13వేలకు దగ్గరలో ఉన్నాయి.
ప్రస్తుతం కరోనా కారణంగా ప్రస్తుతం తమిళనాడు అంతటా పూర్తి కర్ఫ్యూ నడుస్తుండగా.. ఇటీవల కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఈ సమయంలో ప్రభుత్వానికి సినీ కళాకారులు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా సౌత్ ఇండియన్ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తమిళనాడు రాష్ట్రంలో కోవిడ్ బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు.
విజయ్ సేతుపతి తమిళనాడు ముఖ్యమంత్రి కోవిడ్ రిలీఫ్ ఫండ్కు రూ .25 లక్షలు అందించారు. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ను సచివాలయంలో కలుసిన విజయ్ సేతుపతి ఈ మేరకు చెక్ అందజేశారు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోలతో నటిస్తోన్నారు విజయ్ సేతుపతి.
ఆర్ఆర్ఆర్ షూటింగ్ డేట్ ఫిక్స్.. మరి రిలీజ్ ఎప్పుడో?