జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసింది. హీరోలకు మాస్ ఇమేజ్ తీసుకురావడంలో.. ఎలివేషన్స్ ఇవ్వడంలో ప్రశాంత్ నీల్కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఇది రిలీజ్ కాబోతున్నది. అయితే ఈ మూవీలో ఓ పాత్రకు విజయ్సేతుపతి ని ఎంపిక చేసినట్టు సమాచారం.
విజయ్ సేతుపతి సౌత్లో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. డైరెక్ట్గా తెలుగులో ఆయన నటించిన ఉప్పెన సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాయనం పాత్రలో ఆయన ఎంతో ఆకట్టుకున్నాడు. విజయ్కి పలు బాలీవుడ్ సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం తారక్ మూవీలో విజయ్ నటిస్తున్నాడని తెలియగానే ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.
తమిళ మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని విజయ్ ను ఎంపిక చేసిఉంటారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్తో సలార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ పూర్తికాగానే తారక్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే చాన్స్ ఉంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే అన్ని భాషల చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకుంటున్నాడు.
Also Read
మళ్లీ ఫామ్లోకి చిన్నారి పెళ్లికూతురు..!