Saturday, April 20, 2024
- Advertisement -

ఈటల ప్రయాణిస్తున్న విమానానికి తప్పిన ప్రమాదం.. !

- Advertisement -

ఈటల రాజేందర్​ నిన్న అట్టహాసంగా ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తం 184 మంది నాయకులతో ఈటల రాజేందర్​ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి, మాజీ జడ్పీ చైర్​పర్సన్​ తుల ఉమ తదితరులు ఆయనతో ఉన్నారు. అనంతరం ఈటల రాజేందర్​ బీజేపీ కీలక నేతలను కలుసుకున్నారు. ఇదిలా ఉంటే ఇవాళ ఈటల రాజేందర్​ ఢిల్లీ నుంచి అదే విమానంలో తిరిగి వస్తుండగా.. విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్‌ సమయంలో రన్-వే పై సాంకేతిక సమస్య తలెత్తింది.

సమస్యను గుర్తించిన ఫైలెట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో అందరూ సేఫ్‌ అయ్యారు. ఈటల రాజేందర్​తో సహా అంతా ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. ప్రస్తుతం ఈటల రాజేందర్​ శంషాబాద్​ విమనాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు భారీగా కార్యకర్తలు, అనుచరులు స్వాగతం పలికారు. పదుల సంఖ్యలో కార్లు, ఇతర వాహనాల్లో ఈటల అభిమానులు అక్కడికి చేరుకున్నారు.

ప్రస్తుతం శంషాబాద్​ ఎయిర్​పోర్టు పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొన్నది. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్​ తొలిసారిగా హైదరాబాద్​కు రావడంతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈటల రాజేందర్​తో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​ రావు తదితరులు ఉన్నారు.

Also Read

జమ్మూ -కశ్మీర్​ మళ్లీ రాష్ట్రం కాబోతున్నదా?

కరోనాకు కాక్​టెయిల్​ అద్భుతంగా పనిచేస్తోందట..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -