ఈటల రాజేందర్ నిన్న అట్టహాసంగా ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తం 184 మంది నాయకులతో ఈటల రాజేందర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు ఆయనతో ఉన్నారు. అనంతరం ఈటల రాజేందర్ బీజేపీ కీలక నేతలను కలుసుకున్నారు. ఇదిలా ఉంటే ఇవాళ ఈటల రాజేందర్ ఢిల్లీ నుంచి అదే విమానంలో తిరిగి వస్తుండగా.. విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ సమయంలో రన్-వే పై సాంకేతిక సమస్య తలెత్తింది.
సమస్యను గుర్తించిన ఫైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో అందరూ సేఫ్ అయ్యారు. ఈటల రాజేందర్తో సహా అంతా ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ శంషాబాద్ విమనాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు భారీగా కార్యకర్తలు, అనుచరులు స్వాగతం పలికారు. పదుల సంఖ్యలో కార్లు, ఇతర వాహనాల్లో ఈటల అభిమానులు అక్కడికి చేరుకున్నారు.
ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొన్నది. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ తొలిసారిగా హైదరాబాద్కు రావడంతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈటల రాజేందర్తో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు ఉన్నారు.
Also Read