- Advertisement -
తమిళ స్టార్ హీరో శుక్రవారం చెన్నై, ఎగ్మూర్ కోర్టుకు హాజరయ్యారు. సేవా పన్ను శాఖ ఆధికారులు నటుడు విశాల్ కోటి రూపాయల వరకూ సేవా పన్ను చెల్లించని కారణంగా 2016 ఆయనకు సమన్లు పంపారు. ఈ విషయమై విశాల్ను నేరుగా సేవా పన్ను శాఖ కార్యాలయానికి హాజరు కావలసిందిగా ఆదేశించారు. విశాల్ హాజరు కాలేదు.
ఆయన ఆడిటర్, న్యాయవాది మాత్రమే హాజరవుతున్నారు.దీంతో సేవా పన్ను శాఖాధికారులు చెన్నై, ఎగ్మూర్లోని ఆర్థికశాఖా విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు బుధవారం కోర్టులో విచారణకు రావడంతో నటుడు విశాల్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఇక నిన్న(గురువారం) విడుదలైన విశాల్ పందెం కోడి 2 సినిమాపై మిశ్రమ స్పందన వస్తుంది.