యాక్షన్ సినిమాలంటే ప్రమాదాలు పొంచి ఉంటాయి. కొన్ని ప్రమాదకర సన్నివేశాల్లో కొందరు హీరోలు డూప్లు లేకుండానే నటిస్తూ ఉంటారు. ఇలా నటిస్తుండగా తమిళ హీరో విశాల్కు గాయాలయ్యాయి. ‘లాఠీ’ సినిమా షూటింగ్లో ఆయన గాయపడ్డారు. విశాల్ చేతి ఎముకతో పాటు కాలికి ఫ్రాక్చర్స్కి అయినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్కి కాస్త బ్రేక్ ఇచ్చి.. చికిత్స నిమిత్తం కేరళ వెళ్లారు. షూటింగ్లో గాయపడిన వీడియోను విశాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఓ భవనంలో భారీ యాక్షన్ సీన్ను చిత్రీకరిస్తుండగా విశాల్ గాయపడ్డాడు. ఓ చిన్నారిని రౌడీ మూకల నుంచి కాపాడేందుకు భవనం పై నుంచి దూకాలి. ఈ క్రమంలో అతడికి గాయాలయ్యాయి. హీరో విశాల్ గాయపడటంతో సినిమా షూటింగ్ మార్చికి వాయిదా పడింది. మార్చి మొదటి వారంలో మళ్లీ చిత్ర యూనిట్తో జాయిన్ అవుతాను.’ అని విశాల్ తన ట్వీట్లో పేర్కొన్నారు. విశాల్ త్వరగా కోలుకోవాలని అతని అభిమానులు ట్విట్టర్లో కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో విశాల్ చేతిలో ఉన్న ఆ పిల్లవాడు బాగానే ఉన్నాడా అని ఆరా తీస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘లాఠీ’ సినిమాలో విశాల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. విశాల్కి జోడీగా సునయన నటిస్తోంది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రమణ, నంద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 4న విశాల్ నటించిన ‘వీరమయి వాగై సూదుమ్’ ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా సత్తా చాటలేకపోయింది. దీంతో విశాల్ తన తదుపరి సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు.
Also Read: మహేశ్ బాబు తల్లిగా అలనాటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ ?