Wednesday, May 1, 2024
- Advertisement -

టెంపర్ కథ మీద కొత్త ఆరోపణలు

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన చిత్రం టెంపర్. ఈ సినిమా విడుదల అయినా సమయం లో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సాధారణంగా తన సినిమాలకి సొంతం గా కథలు రాసుకొనే పూరి, ఎన్టీఆర్ చెప్పాడు అనే ఒక్క కారణం తో వక్కంతం వంశీ దగ్గర ఉన్న కథ తో ఈ చిత్రం తీసాడు. సినిమా విడుదల అనంతరం ఈ సినిమా కథ కి వచ్చిన ప్రసంశలు అంతా ఇంతా కాదు. ఈ సినిమా కథ నచ్చి ఇతర భాషల్లో కూడా రీమేక్ చేశారు.

అందులో భాగం గా ఈ సినిమా తమిళ్ రీమేక్ నిన్న విడుదల అయింది. ఈ సినిమా లో ఎన్టీఆర్ పాత్ర ని విశాల్ చేయగా, ప్రకాష్ రాజ్ పాత్ర ని పార్తీబన్ పోషించారు. అయితే పార్తీబన్ ఇప్పుడు ఈ సినిమా కథ మీద ఒక ఆరోపణ చేశారు. ఇంతకు ముందే కథ మీద అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఇప్పుడు పార్తీబన్ చేసిన ఆరోపణలు మాత్రం అందరి ద్రుష్టి ని ఆకర్షిస్తున్నాయి. 1993 లో ఉల్లే వెళియే అనే చిత్రం విడుదలయింది. ఈ సినిమా కి దర్శకుడు పార్తీబన్. ఐశ్వర్య ఈ సినిమా లో హీరోయిన్. అయితే తన సినిమా కి టెంపర్ కథ కి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని, తనకి క్రెడిట్ ఇవ్వలేదని పార్తీబన్ చెపుతున్నారట. ఈ సీనియర్ నటుడు ఈ విషయాన్నీ ఎంత సీరియస్ గా తీసుకుంటాడు అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -