Saturday, April 27, 2024
- Advertisement -

ఊటిలో విశ్వంభర..ఏం చేస్తున్నారో తెలుసా?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి – త్రిష కాంబినేషన్‌లో వశిష్ట తెరకెక్కిస్తున్న చిత్రం విశ్వంభర. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2025 జనవరి 10న రిలీజ్ కానుంది. రీసెంట్‌గా హైదరాబాద్ షెడ్యూల్‌ పూర్తి చేసుకోగా తాజాగా ఊటి షెడ్యూల్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.

ఊటిలో విశ్వంభర షూటింగ్ జరుగుగుతోందని ఇందుకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చేశారు దర్శకుడు వశిష్ట. ఊటీలో చలిమంట ముందు కూర్చున్న ఫోటో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ఊటీలో షెడ్యూల్‌ లో చిరు- త్రిష మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

రీసెంట్‌గా హైదరాబాద్ షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్స్ తో పాటు సాంగ్‌, యాక్షన్ పార్టుని చిత్రీకరించారు. కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్‌ కామిరెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్‌లుగా వ్యవహరిస్తుండగా ఫాంటసీ మూవీగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -