హీరో సుధీర్ బాబు ‘సమ్మోహనం’, ‘ నన్ను దోచుకుందువటే సినిమాతో డిసెంట్ హిట్లు కొట్టాడు.దీంతో సుధీర్ బాబుకి వరుస ఆఫర్లు వస్తున్నాయి.తాజాగా సుధీర్ బాబు తన కొత్త సినిమాను మొదలుపెట్టాడు.ఈ సినిమాలో మెహ్రీన్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారు.పులి వాసు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు పని చేయనున్నారు.అయితే సడన్గా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు సుధీర్ బాబు.నిర్మాతకి సుధీర్ బాబుకి మధ్య గొడవ జరగడంతో సుధీర్ బాబు ఈ సినిమా నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.
అడ్వాన్స్ గా తీసుకున్న పాతిక లక్షల రెమ్యునరేషన్ ని కూడా తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికైతే సినిమాని క్యాన్సిల్ చేసేశారు.సుధీర్ బాబు తప్పుకోవడంతో ఈ సినిమాను హీరో విష్ణుతో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు చిత్ర నిర్మాత రిజ్వాన్.ఇక సుధీర్ బాబు పుల్లెల గోపీచంద్ బయోపిక్లో నటించడానికి రెడీ అవుతున్నాడు.