Saturday, May 4, 2024
- Advertisement -

ఆక‌ట్టుకోలేక‌పోతున్న యువ న‌టుడు

- Advertisement -

 

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వేగంతో వ‌చ్చి ఇప్పుడు ప్యాసింజ‌ర్ రైలులా సందీప్‌కిష‌న్ మారాడు. వ‌రుస‌గా చిత్రాలు చేస్తున్నా థియేట‌ర్‌ల‌లో నిల‌బ‌డ‌డం లేదు. మొన్న విడుద‌ల అయిన కేరాఫ్ సూర్య సినిమా నిరాశ ప‌రుస్తోంది. దీంతో సందీప్ కిష‌న్ కెరియ‌ర్ స్లోగా సాగుతోంది. అత‌డికి బీరువా సినిమా చివ‌రిగా సోసో ఆడింది. తర్వాత సినిమాలు అంత‌గా ఆక‌ట్టుకోంది. ఇద్ద‌రు యువ న‌టుల‌తో క‌లిసి తీసిన సినిమా కూడా సందీప్‌కు క‌లిసిరాలేదు. దీంతో సందీప్ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాడు. కాన్సెప్ట్‌ సినిమాలు చేసుకుంటూ వ‌చ్చిన హీరో త‌న పంథా మార్చుకొని యాక్షన్‌పై దృష్టి సారించాడు. కమర్షియల్‌ హీరోగా ఎదగాలని చూస్తున్న కిష‌న్‌కు ఎదుర దెబ్బ త‌గులుతోంది.

కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా న‌క్ష‌త్రంలో సందీప్ ఓ పాత్ర‌లో న‌టించాడు. ఇక నారా రోహిత్‌, ఆదితో క‌లిసి న‌టించిన శ‌మంత‌క‌మ‌ణి, ఇంకో సినిమా న‌గ‌రం, ఒక్క అమ్మాయి త‌ప్పు, ర‌న్, టైగ‌ర్ త‌దిత‌ర సినిమాల‌తో అత‌డు అప‌జ‌యాల బాట ప‌ట్టాడు. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రాలు చేస్తే మార్కెట్ ఉంటుందని భావించి సినిమాలు చేసినా ఫ‌లితం లేదు. కేరాఫ్‌ సూర్యపై చాలా న‌మ్మ‌కం పెట్టుకున్న సందీప్‌కు నిరాశే ఎదురైంది. అయితే అత‌డు హోట‌ల్ వ్యాపారంలోకి అడుగుపెట్ట‌డంతో కొంత ఆర్థికంగా నిల‌దొక్కుకుంటున్నాడు. సందీప్‌కిష‌న్ వివాహ భోజ‌నంబు అనే హోట‌ల్‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

https://www.youtube.com/watch?v=9ghse-cqTvA

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -