జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోను, బుల్లితెరమీద మంచి జోష్ మీదున్నాడు. ఇప్పటికె జైలవకుశ సినిమా ప్రమోషన్ కోసం ముగ్గురు హీరోయిన్లు బిగ్బాస్లోకి వెల్లారు. జై లవ కుశ’ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ వేగాన్ని పెంచారు. తాజాగా రాజమౌళి తీయాలనుకుంటున్న మహాభారతం సినిమాపై కామెంట్స్ చేశారు.
ఈ సినిమాలో జై పాత్ర కోసం తాను చాలా కష్టపడవలసి వచ్చిందని చెప్పారు. ఎక్కడా రెఫరెన్సులు తీసుకోలేదనీ .. తన స్టైల్లో తాను చేస్తూ వెళ్లానని అన్నారు. మూడు పాత్రలు ఓకే సారి చేయవలసి రావడం వలన తనపై బాగా ఒత్తిడి పెరిగిందని చెప్పారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఇక రాజమౌళి ‘మహాభారతం’లో తాను చేసే అవకాశం వున్నట్టుగా వస్తోన్న వార్తల గురించి కూడా ప్రస్తావించారు. రాజమౌళి ‘మహాభారతం’ తీస్తే .. ఆ సినిమా కోసం తనని సంప్రదిస్తే ఎంత మాత్రం లేట్ చేయకుండా ఓకే చెప్పేస్తానని అన్నారు. చిన్న పాత్రయినా చేయడానికి తాను సిద్ధమనీ, అయితే తనకి ఏ పాత్ర ఇవ్వాలో రాజమౌళికి తెలుసునని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును గురించిన ప్రచారం మాత్రమే జరుగుతుంది కనుక, ఈ సినిమా గురించి రాజమౌళి మాట్లాడితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహాభారంతంలో జూనియర్ ఎన్టీఆర్ తన పాత్రపై క్లారిటి ఇచ్చారన్నమాట.