Thursday, April 25, 2024
- Advertisement -

డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు, అవసరాల కోసం మారిపోయిన నిజాయితీః పూనం కౌర్

- Advertisement -

పూనం కౌర్ ట్వీట్స్ చూశాక ఎవరైనా వాహ్…….. అనాల్సిందే. అవతల ఉన్నది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భజన చేస్తూ ఇద్దరు చంద్రుల చేత కూడా అవసరమైన పనులు చేయించుకుంటున్న పవర్ఫుల్ పర్సన్. ఇటువైపు ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ తెలుగు నాట బ్రతుకుదెరువు కోసం చూస్తున్న సాధారణ అమ్మాయి. బలాబలాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి.

కానీ అవసరాల కోసం పూనం కౌర్‌ని వాడుకున్నారు. ఆ తర్వాత వదిలేశారు. మేధావి అని చెప్పి తెలుగు సినిమా ఇండస్ట్రీ సర్టిఫికెట్ ఇచ్చిన ఒక రైటర్ కం డైరెక్టర్ ఆడిన గేంలో పూనం కౌర్ పావు అయింది. ఇక నిజాయితీ, సిద్ధాంతాలు లాంటి మాటలను తెలుగు సినిమా ఇండస్ట్రీలో తరచుగా చెప్పే హీరో ఒక్కడే. ఆ హీరో ఎవరో అందరికీ తెలుసు. ఆ విషయం పూనం కౌర్‌కి కూడా తెలుసు. అందుకే ఇప్పుడు డైరెక్ట్‌గా అతనికే తగిలేలా ట్వీట్ వదిలింది. మాటలు గొప్పగా చెప్తూ జనాలను మాయ చేస్తూ రాజకీయం చేస్తున్న ఆ స్టార్ హీరోకి గట్టిగా తగిలేలా ట్వీట్స్ చేసింది. డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు…… మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయితీ……. నీ గౌరవం ఏంటి? ఇవీ పూనం కౌర్ సంధించిన ట్వీట్స్. ఇప్పుడు ఇవే హాట్ టాపిక్ అయ్యాయి. ప్యాకేజ్ వ్యవహారాల గురించి ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పూనం కౌర్ సంధించిన ట్వీట్ బాణాలు మాత్రం సూటిగా గుచ్చుకుంటున్నాయి. మూఢాభిమానులు పూనంపై విరుచుకుపడడం ఇంకాస్త బ్యాడ్ నేం తెస్తోంది. ప్రజలకు అసలు విషయాలు అయితే అర్థమవుతున్నాయి. మూఢాభిమానులు కూడా కాస్త తెలివి తెచ్చుకుంటే మాత్రం గొప్పగా మాటలు చెప్తూ….. చేతల్లో పూర్తి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళ సినిమా డ్రామాలకు శుభం కార్డ్ పడడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -