Friday, April 26, 2024
- Advertisement -

మీడియా ఎదుట శివాజీ రాజా క‌న్నీళ్లు ఎందుకో..?

- Advertisement -

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అసోసియేషన్ ఎన్నికల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది పోటీ చేసేవారి రచ్చ ఎక్కువ అవుతోంది. ఈ నెల 10తో మా అధ్య‌క్ష‌డు కాల‌ప‌రిమితి ముగ‌య‌నుంది. ప్ర‌స్తుతం మా అధ్య‌క్షుడుగా ఉన్న శివాజీ రాజా మ‌ళ్లీ పోటీకి సై అన్న‌డంతో ఎన్నిక‌లు అనివార్యంగా మారాయి. శివాజీ రాజాకు పోటీగా న‌టుడు న‌రేశ్ ఎన్నిక‌ల‌లో ఫైట్ చేస్తున్నారు. మేము అంతా ఒక‌టే అని చెబుతునే ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.నరేష్ టీవీ చానెళ్లకు ఎక్కి శివాజీ రాజా అవినీతి పరుడు, మాలో దిగజారుడు తనం ఉందని ఆరోపిస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది. ఈ వార్త‌ల‌పై స్పందించాడు శివాజీ రాజా. దీనిపై స్పందిస్తు మీడియా ఎదుట క‌న్నీరు పెట్ట‌కున్నారు శివాజీ రాజా.

కళాకారులంతా కోరడం వల్లనే వారి కోసం మరోసారి అధ్యక్ష పదవికి పోటీపడుతున్నానని , అంతే కాని నాకు ప‌ద‌విపై మోజు లేద‌ని చెప్పుకొచ్చాడు. త‌న‌ని న‌రేశ్ అన్యాయంగా అవమానిస్తున్నాడని తెలిపారు. నేను కుటుండంతో క‌లిసి అరుణాచలం వెళ్లిపోయి అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నామని శివాజీ రాజా ఎమోషనల్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌ర కంట క‌న్నీరు పెట్టుకుని కాస్తా ఎమోష‌న‌ల్ అయ్యారు. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి ప‌ని చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. కాని ఇప్పుడు మాత్రం ప్ర‌త్య‌ర్థులుగా మారి మా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -