ఆంధ్రుల అందగాడు, సోగ్గాడు శోభన్ బాబు. ఆయన చాలా సిన్సియర్ అని చాలా మంది చెప్తుంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత , శోభన్ బాబు మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందనేది బహిరంగ రహస్యమే. అయితే వారి బంధం గురించి ఇప్పుడు ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
అల నాటి ప్రముఖ రచయిత ఆరుద్ర భార్య కె.రామలక్ష్మి విల్లిద్దరి మధ్యనున్న బంధం గురించి నిజాలు వెల్లడించారు. కాలమిస్ట్, రైటర్, క్రిటిక్ రామలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శోభన్ బాబు గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. నన్ను ఓ సారి శోభన్ బాబు తమ ఇంటికి పిలిచాడు. శోభన్ బాబు భార్య సరిగ్గా, గౌడి గేదెలా ఉంటుంది. అయితే, ఆమె మంచి మనిషి. ‘మా గురువు గారి కూతురు. ఆయన పెళ్లి చేయలేడు. అందుకని, నేను చేసుకున్నా’ అని నాతో చెప్పాడని తెలిపారు.
జీవనజ్యోతి’ సినిమాకు ‘సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని..’ పాట రాస్తున్నప్పుడు నేను శోభన్ బాబు ఇంటికి వెళ్లాను. శోభన్ బాబు వెరీ ఫైన్ మ్యాన్. జయలలిత వెరీవెరీ.. ఫైన్ టాలెంటెడ్ గార్ల్. ‘గోరింటాకు’ సినిమాను జయలలిత ఇంట్లో చిత్రీకరించారు. ‘మీరందరూ ఇక్కడ భోజనం చేయండి’ అని ఆ రోజున శోభన్ బాబుతో జయలలిత అంది. ‘ఎందుకు, ఫుల్ డే షూటింగ్ లేదు’ అని ఆయన సమాధానం చెప్పాడు. ‘లేదు. నేను వడ్డిస్తా’ అంది.. జయలలిత నిజమైన ప్రేమ కనబరుస్తుంది.
జయలలితను శోభన్ బాబు పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కానీ, సాధ్యపడలేదు. ఎందుకంటే, ఆయన తన భార్యను మోసం చేయలేక. శోభన్ బాబు చాలా సిన్సియర్. శోభన్ బాబు కొడుకు కూడా బాగానే ఉంటాడు. కాని సినిమాల్లోకి రావద్దని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.