- Advertisement -
టాలీవుడ్ లో అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై పోరాటం చేస్తున్న హీరోయిన్ శ్రీరెడ్డికి ఊహించని మద్దతు లభించింది. ఆమెకు మద్దతుగా జాతీయ మానవ హక్కుల కమిషన్ నిలిచింది. శ్రీరెడ్డిని సినీ ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేసే హక్కు లేదని ఆమె హక్కులకు భంగం కలిగించడమేనని మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది.
దీనికి సంబంధించి తెలంగాణ, కేంద్ర సమాచార ప్రసారశాఖలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని నోటీసులో ఆదేశించింది. శ్రీరెడ్డి మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించలేదు,కాని కమిషనే ఆమె కేసును సుమాటోగానే స్వీకరించి, చివరకు నోటీసులు జారీ చేసింది.మరి దీనిపై తెలుగు చిత్ర మండలి ఏ విధాంగా స్పందిస్తుందో చూడాలి.