Saturday, May 18, 2024
- Advertisement -

‘జాతిరత్నాలు’ మూవీకి కొత్త కష్టాలు!

- Advertisement -

‘జాతి రత్నాలు’ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నటించిన ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ‘జాతి రత్నాలు ’ మూవీని బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ శివసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమా గంగాధర్‌ ఆధ్వర్యంలోని ప్రతినిధులు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. 

ఇందులో దేశభక్తి ప్రబోధాత్మకమైన ఓ కవితను వ్యంగ్యంగా ఆలపించారని శివసేన తెలంగాణ విభాగం నేతలు పోలీసులకు ఫిర్యాదు లో పేర్కొన్నారు. కాగా, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ ఉరికొయ్యకు వేలాడే ముందే సర్ఫరోష్ కీ తమన్నా హబ్ హమారే దిల్ మే హై అంటూ పాడిన పాటను జాతిరత్నాలు చిత్రంలో అవమానకరీతిలో ఆలపించారని, ఆ గేయం పంక్తుల్లో టాలీవుడ్ హీరోయిన్ల పేర్చు చేర్చి వ్యంగ్యంగా మార్చేశారని శివసేన నేతలు ఆరోపించారు.

 దేశం కోసం పోరాడిన మహానతలకు ఇలాంటి అవమానం జరిగితే సహించేది లేదని.. నేటి తరానికి తప్పుడు సందేశాన్ని అందించిన సినీ రచయిత, నిర్మాత, మ్యూజిక్‌ డైరెక్టర్, కవితను ఆలపించి అవమానపరిచిన గాయకులపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

సరదాగా, సందడిగా రాజమండ్రిలో ‘రంగ్ దే’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్

`99 సాంగ్స్‌` సినిమా జర్నీతో మ్యూజిక్‌ కోణం మారింది: రెహ‌మాన్‌

‘గ‌ల్లీరౌడీ’ గా మారిన సందీప్ కిష‌న్ ‘రౌడీ బేబి’.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -