Sunday, May 5, 2024
- Advertisement -

‘జాతిరత్నాలు’ సీక్వెల్ రాబోతుందా?

- Advertisement -

గత ఏడాది కరోనా కారణంగా థియేటర్లు అన్నీ బంద్ అయ్యాయి. దాంతో చాలా చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇక థియేటర్లు ఓపెన్ అయ్యాయి.. చిన్నా పెద్దా చిత్రాలు థియేటర్లో సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కలెక్షన్లు కూడా భారీగానే రాబట్టింది. ఇక చిట్టి ఫరియా నటన, సహజ అందం ఈ సినిమాకు కలిసొచ్చింది.

స్వప్న సినిమా బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకి అనుదీప్ దర్శకత్వం వహించాడు. నవీన్ పోలిశెట్టి .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించారు. దర్శకనిర్మాతలు సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పుకుంటున్నారు.

జాతిరత్నాలు చిత్రంలో జోగిపేట నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చాక ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డారో చూపించారు. అయితే సీక్వెల్ మూవీలో ఈ ముగ్గురు తమ కలలు నెరవేర్చుకోవడానికి అమెరికా వెళ్తారు.. అక్కడ ఏం కష్టాలు పడ్డారు అన్నదే చిత్ర కథ అంటున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

సల్మాన్ ఖాన్ ‘రాధే’ట్రైలర్ రిలీజ్.. సీటీమార్స్ స్పెషల్..

మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్‌కు కరోనా

ఆ కింగ్ కోబ్రా చూస్తే గుండె గుభేల్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -