గుంటూరు జిల్లా నరసరావుపేటలో సహ విద్యార్థి చేతిలో దారుణ హత్యకు గురైన విద్యార్ధిని అనూష మృతదేహానికి కాసేపట్లో శవపరీక్ష జరగనుంది. నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం పూర్తి చేసి.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అనూష స్వస్థలం గోళ్లపాడులో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన కోట అనూష (19), బొల్లాపల్లి మండలం పమిడిపాడుకు చెందిన విష్ణువర్ధన్రెడ్డి మధ్య కొన్నాళ్లుగా పరిచయం ఉంది. బుధవారం ఉదయం ఇంటి నుంచి అనూష కళాశాలకు బయలుదేరగానే విష్ణువర్ధన్రెడ్డి ఫోన్ చేసి ముఖ్యమైన పని ఉందని, కలవాలని చెప్పారు. దీంతో అనూష ఇంటి నుంచి కళాశాలకు వెళ్లకుండా అతడు చెప్పిన ప్రాంతానికి వెళ్లింది.
అక్కడి నుంచి ఇద్దరూ కలిసి ఆటోలో నరసరావుపేట మండలం పాలపాడు వరకు వెళ్లి ఆటోను పంపేశారు. అటునుంచి సాగర్ కాలువ వైపు నడుచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణకు దారితీసింది. విష్ణువర్ధన్రెడ్డి అనూష చున్నీతోనే ఆమె గొంతు బిగించి చంపేసి కాలువలో పడేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా నరసరావుపేట గ్రామీణ పోలీసుస్టేషన్కు వచ్చి, విషయం చెప్పి లొంగిపోయాడు. పోలీసులు అనూష మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
సరికొత్త ప్రయోగాత్మక మూవీగా రాబోతున్న “మడ్డీ” !