దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో కేసుల సంఖ్య నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత ఏడాది నుంచి కరోనా వైరస్ దేశంలో ఎన్నో బీభత్సాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ కరోనా కాటుకు బలి అవుతున్నారు. ఈ మద్య కరోనా ను నిర్మూలించే టీకాలు అందుబాటులోకి వచ్చాయి.
ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా టీకాలు వేయించుుకున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అయితే సల్మాన్ ఖాన్ ఆసుపత్రికి వెళ్లిన సందర్భంగా అక్కడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఆయన కరోనా టీకా తొలి డోసు తీసుకునేందుకు వెళ్లినట్లు తర్వాత తెలిసింది.
అంతే కాదు బాలీవుడ్ స్టార్ సంజయ్దత్ కూడా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. బీకేసీ వ్యాక్సిన్ సెంటర్లో టీకా వేయించుకున్నట్టు పేర్కొన్నాడు. వీరు మాత్రమే కాదు.. బాలీవుడ్ కి చెందిన పలువురు సెలబ్రెటీలు.. హేమామాలిని, అనుపమ్ ఖేర్, జానీ లివర్, సైఫ్ అలీఖాన్, కమలహాసన్, సతీశ్ షా తదితరులు కూడా వ్యాక్సిన్ షాట్లు తీసుకున్నారు.
బంపర్ ఆఫర్ కొట్టేసిన బుట్టబొమ్మ !