దేశంలో కరోనా తీవ్రత ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మూలిగే నక్కమీద తాటికా పడ్డట్టు ఈ మద్య ప్రకృతి వైపరిత్యాలతో మరణాలు సంబవిస్తున్న విషయం తెలిసిందే. అనుకోని మరణాలు మరోవైపు.. తాజాగా ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగానే చనిపోయారు.
ఒక ఇంట్లో భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలు నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి భోజనాల అనంతరం నిద్రపోయారు. బుధవాం తెల్లవారుజామున వారి ఇంటి పైకప్పు కూలిపోయింది. దీంతో ఆ కుటుంబంలోని ఐదుగురు నిద్రలోనే మరణించారు.
స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురు పిల్లలు, వారి తల్లి మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల్లో ఉన్న మరో వ్యక్తి మృతదేహం వెలికితీసే పనులు చేపట్టినట్లు జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ లక్కర్ తెలిపారు.
హమ్మయ్య నాకు నెగిటీవ్ వచ్చింది : అనీల్ రావిపూడి
గోవాలో లాక్ డౌన్.. ఎప్పటి వరకు అంటే..
దయచేసి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవొద్దు.. సోదరిగా కోరుతున్న : షర్మిల