Friday, April 26, 2024
- Advertisement -

దయచేసి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవొద్దు.. సోదరిగా కోరుతున్న : షర్మిల

- Advertisement -

తెలంగాణలో ప్రజల కోసం పోరాడుతా అంటూ ప్రత్యేక పార్టీ ఏర్పాటుకు సంసిద్దం అవుతున్నారు వైఎస్ షర్మిల. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఖమ్మం లో జరిగిన భారీ మహాసభలో త్వరలో జెండా, అజెండా గురించి తెలియజేస్తానని తెలిపారు. ఈ మద్యనే తెలంగాణ లో లక్ష ఉద్యోగాల భర్తీ కోసం 72 గంటల పాటు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. తాజాగా నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పపడ్డాడు.

బాటనీలో పిజి చేసిన శ్రీకాంత్ ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నాడు. శ్రీకాంత్ తండ్రి రామచంద్ర మృతి చెందాడు. తల్లి గంగమ్మ మానసిక రోగి కావడంతో పట్టుదలతో పిజి పూర్తి చేశాడు. కరోనా సమయంలో ఉద్యోగాలు లేకపోవడంతో పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

తాజాగా దీనిపై స్పందించిన షర్మిల నిరుద్యోగులు ఆత్మవిశ్వాసం కోల్పోరాదని, ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల కోసం తాను ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. మీ అక్కగా చెబుతున్నా… దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు కోరారు.

షర్మిలకు షాక్ ఇచ్చిన టీ సర్కార్

అస్సాంలో భారీ భూకంపం..

తెలంగాణలో కరోనా విజృంభణ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -