హైదరాబాద్లో డ్రగ్స్పై పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో కీలక పురోగతి సాధించారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్ జూబ్లీ హిల్స్ జోన్ బృందం, లాలాగూడ పోలీసులతో కలిసి నిర్వహించిన దాడుల్లో రూ.2 లక్షల విలువైన 4 కిలోల డ్రై గంజాతో నలుగురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
డ్రై గంజా: 4 కిలోలు,మొబైల్ ఫోన్లు: 3,మొత్తం అంచనా విలువ: రూ.2,00,000 ఉంటుందని అధికారులు తెలిపారు. నగరంలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం కఠిన చర్యల భాగంగా ఈ స్వాధీనం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
అరెస్ట్ చేసిన నలుగురిలో ఒకరు సరఫరాదారుగా (సప్లయర్),మరొకరు పేడ్లర్గా..ఇద్దరు వినియోగదారులుగా గుర్తించారు.గంజాను రాష్ట్రం బయట నుంచి తెచ్చి హైదరాబాద్లో పంపిణీ చేయాలని యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.
సరఫరాదారు నగరానికి గంజా తీసుకొచ్చి రైల్వే హాస్పిటల్ సమీపంలో సంప్రదింపులు జరపగా, గూఢచారి సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్కు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్య, చట్టపర, సామాజిక సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.
హైదరాబాద్లో డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు కొనసాగుతాయని, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై జీరో టాలరెన్స్ విధానం అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
