Saturday, May 18, 2024
- Advertisement -

డీఎస్ కుమారుడు సంజ‌య్‌పై నిర్భ‌య కేసు న‌మోదు….

- Advertisement -

డీఎస్ తనయుడు సంజయ్‌పై శుక్రవారం నాడు నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు సంజయ్‌పై లైంగిక ఆరోపణలు చేయడంతో సంజయ్‌పై నిజామాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన సొంత కళాశాల ‘శాంకరి’కి చెందిన నర్సింగ్ విద్యార్థినులు నిన్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాధితులకు అండగా ఉంటామని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాదు తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే నిజామాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేయాలని హోం మంత్రి విద్యార్థినులకు సూచించారు.

సంజయ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి వెళ్లినట్టు సమాచారం. అయితే, సంజయ్ అక్కడ లేకపోవడంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. గ‌తంలో డీఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నార‌ని నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేత‌లు సీఎం కేసీఆర్‌ను క‌ల‌సి ఫిర్యాదు చేశారు. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. అంత‌లోకే కొడుకు సంజ‌య్‌పై లైంగిక ఆరోప‌న‌లు రావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -