హైదరాబాద్ నిజాంపేటలో ఈనెల 27న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప్రమాదానికి గురైన ఏఎస్సై అన్నపురెడ్డి మహిపాల్ రెడ్డి మృతి చెందారు. కొండాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. బ్రెయిన్ డెడ్ అయి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేశారు.
మహిపాల్రెడ్డి అంత్యక్రియలను బండ్లగూడజాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిపాల్రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏఎస్సై మృతి వార్త తెలుసుకున్న గ్రామస్థులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
నిజాంపేట్ రోడ్డులోని కొలను రాఘవరెడ్డి గార్డెన్ వద్ద శనివారం రాత్రి 11 గంటలకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీ సమయంలో రోడ్డుప్రమాదం జరిగిందని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలిని పరిశీలించేందుకు ఎస్సై సక్రమ్, ఏఎస్సై మహిపాల్రెడ్డి వెళ్లారు.అదే సమయంలో అటుగా వచ్చిన అస్లాం అనే వ్యక్తి.. కారుతో దూసుకొచ్చాడు.
మద్యం మత్తులో దొరికితే శిక్ష పడుతుందని తప్పించుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా పోలీసులపైకి కారును పోనిచ్చాడు. ఈ క్రమంలో మహిపాల్ రెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఏఎస్సై ప్రాణాపాయస్థితిలో ఉండగా.. కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు.
సాగర్ ఉప ఎన్నిక ఎఫెక్ట్.. బీజేపీకి వరుస షాకులు!
ఎన్టీఆర్ ఆశయాలను, సిద్ధాంతాలు భ్రష్టు పట్టించారు: మంత్రి కొడాలి నాని