Thursday, April 25, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఆశయాలను, సిద్ధాంతాలు భ్రష్టు పట్టించారు: మంత్రి కొడాలి నాని

- Advertisement -

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు.  తెలుగుదేశం పార్టీ దొంగపార్టీ అని.. ఎన్టీఆర్ ఆశయాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. ఎంతో ఉన్నతాశయంతో ఆ గొప్ప మనిషి పార్టీని స్థాపిస్తే దొంగ దెబ్బ తీసి పార్టీ తన వశం చేసుకున్నాడని.. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ ఆశయాలను సిద్ధాంతాలను పూర్తిగా బ్రష్టు పట్టించారు చంద్రబాబు అంటూ మండిపడ్డారు.

రాజకీయ ప్రాధాన్యం లేని అట్టడుగు వర్గాల కోసం ఎన్ఠీఆర్ పార్టీని స్థాపించారు. ఎన్ఠీఆర్ అంటే గిట్టని వారికి కూడా ఆయనపై భేదాభిప్రాయాలు లేవు.. కానీ ఆయన పేరు చెప్పి వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు, అవినీతి చక్రవర్తి అయిన చంద్రబాబు.. ప్రజలను మనుషులుగా కూడా గౌరవించలేని వ్యక్తి అని విమర్శించారు. మొన్న ఎన్నికల్లో ప్రజలకు సిగ్గులేదంటూ నానా మాటలు అన్నాడు.. మీరు బతికున్న సచినట్లే లెక్క అని ప్రజల్ని నిందించే స్థాయి చంద్రబాబు దిగజారుడు తనం ఏంటో నిరూపించుకున్నాడని అన్నారు.

చంద్రబాబుకు ఆ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగే హక్కు లేదు. 20 లక్షలున్న ఎకరా పొలం 10 లక్షలు కావడానికి కారణం బాబు..20 లక్షలున్న పొలాన్ని కోట్లకు ఒకే ప్రాంతంలో పెంచిన ఘనత బాబుదే అన్నారు. ఇలాంటి అసమానతలు రాకూడదనే అన్ని ప్రాంతాలు సమానంగా అబివృద్ది జరగాలని వికేంద్రీకరణ చేశారు.

జగన్ ఇచ్చిన పథకాలకు, డబ్బుకు ప్రజలు అమ్ముడు పోయారంటూ చంద్రబాబు అనూయాయలు విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్ నాగలోకం అయితే చంద్రబాబు నక్కతో సమానమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగింది టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కాదు.. పగటివేషగాళ్ల డ్రామా అని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 1న వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ.. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కాదని చెప్పారు.

పంజాబ్​ కింగ్స్​ మొత్తం మారిపోయింది.. అవును ఇది చూడండి..!

మరో నెలలో జగన్ మళ్లీ పథకాల వర్షం.. అంతా సిద్దం..!

మాస్క్ లేక పోతే మోత మోగినట్టే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -