దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతుంది. రోజురోజుకూ కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గత వారం రోజుల నుంచి వరుసగా రెండు లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2,73,810 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇదిలా ఉంటే కరోనా తో సెలబ్రెటీలు, రాజకీయ నేతలు బలి అవుతున్న విషయం తెలిసిందే.
తాజాగా బీహార్ మాజీ మంత్రి, జేడీయూ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరి కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజాగా బీహార్ మాజీ మంత్రి, జేడీయూ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరి కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గతవారం కరోనా బారినపడిన ఆయన పాట్నాలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. మేవాలాల్ మృతికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి విద్య, రాజకీయ రంగాలకు తీరని లోటని పేర్కొన్నారు.
కన్నీరు పెట్టుకుంటున్న సినీనటి.. అందమైన ముఖం.. అందవికారంగా మార్చిన బ్యూటీషియన్..