తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. కరోనా కాటుకు సెలబ్రెటీలు విల విలలాడుతున్నారు. తాజాగా మహేష్ బాబు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో పరశురాం తెరకెక్కిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ మూవీ ఇదని తెలుస్తోంది.
ఈ మూవీ కోసం జిమ్ముల్లో కసరత్తులు చేసి మహేష్ ఫిజికల్ మేకోవర్ తీసుకు వచ్చారు. ఇప్పటికే ఈ చిత్రం దుబాయ్లో కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ జరుపుకుంది. ఇక రీసెంట్గా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ రెండో షెడ్యూల్ మొదలు పెట్టారు.
హైదరాబాద్లో చిత్ర షూటింగ్ జరుగుతుండగా, యూనిట్లో కీలక వ్యక్తి ఒకరు కరోనా బారిన పడటంతో వెంటనే చిత్రీకరణ నిలిపివేశారు. ఈ నెలాఖరున మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. కాగా, కరోనా నేపథ్యంలో మహేష్ తాను చేయాల్సిన యాడ్ షూటింగ్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు.
కన్నీరు పెట్టుకుంటున్న సినీనటి.. అందమైన ముఖం.. అందవికారంగా మార్చిన బ్యూటీషియన్..