తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు వారం రోజులుగా కనిపించకుండా పోయారు. ఆయన ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసి ఉంది. అలాగే, కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్బాబును టీఆర్ఎస్లోకి ఆహ్వానించడంపై గుర్రుగా ఉండడం వల్లే మధు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు చెబుతున్నారు.
అయితే, పుట్ట మధు ఎక్కడున్నారన్న విషయం పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలుసని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. పుట్టా మధును పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆయనను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమవరం నుంచి ఆయనను హైదరాబాదుకు తరలిస్తున్నారు. మరోవైపు, ఆయనను ఏ కేసులో అరెస్ట్ చేశారనే విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు.
కాగా, హైకోర్టు న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధుపై ఆరోపణలు రాగా, పోలీసులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. అయితే ఈటలతో సంబంధాల నేపథ్యంలో మధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు.
భూమిపై వచ్చే రాకెట్ పై క్లారిటీ ఇచ్చిన చైనా