రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్ పూర్ లో దారుణం చోటుచేసుకుంది. రాత్రి తల్లి పక్కన పడుకున్న రెండు నెలల బాలుడిని ఇంటిపైన నీటి ట్యాంకులో పడేశారు దుండగులు. ఉదయం బాలుడి కోసం వెతకగా.. ఇంటి పైన ఉన్న ట్యాంకులో బాలుడి డెడ్ బాడీ కనిపించింది. తెల్లవారుజాము నుంచి పసిబిడ్డ కనిపించడం లేదంటూ గాలించిన తల్లిదండ్రులు చివరకు పోలీసులకు ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో అనాజ్ పూర్ లో సిసి కామెరా ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు చిన్నారి అచూకీ లభించకపోవడంతో ఇంటి పైన వెతికారు. నీటి ట్యాంకులో పసికందు మృతదేహం గుర్తించారు. రెండేళ్ల చిన్నారి వాటర్ ట్యాక్ పైకి వెళ్లడం కష్టం.. అయితే కావాలనే ఆ చిన్నారిని ఎవరో అందులో పడవేసి ఉంటారని అంటున్నారు పోలీసులు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిని ఎసిపి పురుషోత్తం పరిశీలించారు. చిన్నారి మేనమామ, అత్తను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కుటుంబకలహాలే చిన్నారి హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారిని చంపేసి ఇంటిపైన ట్యాంకులో పడేసిన నిందితుల కోసం గాలిస్తున్నామని ఎసిపి స్పష్టం చేశారు.
సిధ్ధిపేటలో విషాదం.. తన చితి తానే పేర్చుకొని వృద్దుడి మృతి!