సిద్ధిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్లో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇంటిని, ఒంటరిగా ఉంటున్నాడనే కారణంతో అధికారులు మళ్లీ తిరిగి తీసేసుకోవటంతో వృధ్దుడు మనస్థాపం చెంది తన తానే చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లారెడ్డి ఉంటున్న ఇల్లు మొత్తం మల్లన్నసాగర్ ప్రాజెక్టులో పోయింది. ఈ నేపథ్యంలో అతనికి ప్రభుత్వం తరుపు నుంచి డబుల్ బెడ్ రూమ్ మంజూరు అయ్యింది.
కూతురు కుమారుడు, అప్పుడప్పుడు తాత వద్దకు వచ్చి వెళుతూ ఉండేవాడు. తన భార్య చనిపోవడంతో గత కొంత కాలంగా ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూం ఇంటికి దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఆయనకు ఇల్లు మంజూరు చేశారు. మల్లారెడ్డి అందులో జీవించసాగాడు.
ఈ నేపథ్యంలో అధికారులు ఇంటిని ఖాళీ చేయించారనే కారణంతో మల్లారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం అర్ధరాత్రి తను నివాసం ఉండే ఇంట్లో చితి పేర్చుకుని… కిరోసిన్ పోసుకుని అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లారెడ్డి మనవడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏ సినిమా విడుదల ఎప్పుడు? అంతా గందరగోళమే..!