Monday, April 29, 2024
- Advertisement -

పవన్‌కు ఆమంచి షాక్‌..?

- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చారు చీరాల జనసేన సమన్వయకర్త ఆమంచి స్వాములు. చీరాల ఇంఛార్జీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను రిలీజ్ చేశారు. చీరాల టికెట్ ఆశీంచారు ఆమంచి. అయితే పొత్తులో భాగంగా జనసేనకు గిద్దలూరు టికెట్ మాత్రమే దక్కింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆమంచికి షాక్ తగలగా గిద్దలూరు నుండి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అక్కడి నుండి టికెట్ దక్కుతుందా అన్నది ప్రశ్నార్థకంగానే మారింది.

తనపై నమ్మకం ఉంచి చీరాల సమన్వయకర్తగా నియమించినందుకు ధన్యావాదలు తెలిపారు ఆమంచి స్వాములు. వ్యక్తిగత కారణాలతోనే చీరాల సమన్వయకర్త పదవి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే పార్టీలో కార్యక్తగా కొనసాగుతానని చెప్పుకొచ్చారు.

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడే ఆమంచి స్వాములు. కృష్ణమోహన్ రెండు సార్లు చీరాల నుండి ఎమ్మెల్యేగా గెలవగా ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు స్వాములు. ఎన్నికల సమయంలో సమన్వయకర్త పదవి నుండి స్వాములు తప్పుకోవడం పవన్‌కు గట్టి దెబ్బేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -